
రాజకీయాలు

టెక్ దిగ్గజం ఒరాకిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను రద్దు చేయడం సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన నెల రోజుల వ్యవధిలోనే ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్లను వెనక్కి తీసుకోవడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.
ఐఐటీల్లో ఉన్న “ఒక ఆఫర్” పాలసీ కారణంగా విద్యార్థులు ఇతర కంపెనీలకు అప్లై చేసుకోలేకపోతున్నారు. హైదరాబాద్, కాన్పూర్, ఖరగ్పూర్ ఐఐటీల్లోని 50 మందికి పైగా విద్యార్థులు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
ఎన్ఐటీ విద్యార్థి ఆదిత్య కుమార్ బరావల్ లింక్డ్ఇన్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!