

చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ నాయకత్వ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ఉద్యమం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచల సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్యం, త్యాగాలు భవిష్యత్ తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా క్విట్ ఇండియా ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఈ ఉద్యమం దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని, ‘డూ ఆర్ డై’ అనే సంకల్పంతో ప్రజల్లో అపారమైన ధైర్యాన్ని నింపిందని ఆయన గుర్తుచేశారు. జాతి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ స్వదేశీని ప్రోత్సహించాలని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!