
జనరల్

నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు క్రమంగా చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం మరియు అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశముందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!