
క్రీడలు

బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ తన ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ను సోషల్ మీడియాలో పంచుకోవడంతో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఏడాదికి రూ.23 లక్షలు సంపాదిస్తున్న ఆయన.. 35 ఏళ్ల వయసు వచ్చే నాటికి రూ.2.5 కోట్ల నిధిని సమకూర్చుకుని కార్పొరేట్ ఉద్యోగానికి వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు. ఆ తర్వాత తనకు ఇష్టమైన ఫిల్మ్మేకింగ్ రంగంలోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భవిష్యత్తులో కుటుంబ ఖర్చులను పంచుకునేందుకు ఏడాదికి సుమారు రూ.10 లక్షలు సంపాదించే ఉద్యోగినిని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే పెద్ద నగరంలో కుటుంబాన్ని పోషించేందుకు అయ్యే ఖర్చులు, జీవన వ్యయాలను లెక్కించిన తర్వాత రూ.2.5 కోట్ల లక్ష్యం సరిపోతుందా అనే సందేహం ఆయనలో మొదలైంది. దీంతో తన రిటైర్మెంట్ ప్లాన్పై సలహా కోరుతూ ఆన్లైన్లో చర్చకు తెరతీశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!