

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నల్లబెల్లిలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ముందుగా పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్.. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్రెడ్డిని గుర్తుచేసుకుంటూ కేసీఆర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను కేసీఆర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. పెద్ది సుదర్శన్రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున రూ.2 కోట్లు, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!