

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టికెట్ బుకింగ్ మోసాలను అరికట్టడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు దేశవ్యాప్తంగా భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 3 కోట్ల అనుమానాస్పద యూజర్ ఖాతాలను పూర్తిగా నిలిపివేసి, మరో 6 కోట్ల ఖాతాలను వెరిఫికేషన్ కోసం ప్రత్యేక నిఘాలో ఉంచింది. మొత్తం 9 కోట్ల ఖాతాలపై విచారణ కొనసాగుతోంది. అదనంగా అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడంతో పాటు వేలాది నకిలీ ఈమెయిల్ డొమైన్లను బ్లాక్ చేసింది.
ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం దేశవ్యాప్తంగా 800కు పైగా రైల్వే వంటశాలల్లో 2,394 ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు ఆహార తయారీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలను వెంటనే గుర్తిస్తాయి. గ్లౌజులు, క్యాప్లు ధరించకపోవడం నుంచి ఈగలు, ఎలుకలు వంటి సమస్యల వరకు గుర్తించి వెంటనే అలర్ట్లు జారీ చేస్తాయి. దీంతో లక్షలాది ప్రయాణికులకు మరింత సురక్షితమైన మరియు నాణ్యమైన ఆహారం అందించే దిశగా ఐఆర్సీటీసీ అడుగులు వేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!