
బిజినెస్

అసోం రాష్ట్రం 2028 నాటికి రూ.10 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా వేగంగా ముందుకెళ్తోందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అసోం శాసనసభలో మాట్లాడిన ఆయన, గత ఐదేళ్లలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. 2021-22లో రూ.4 లక్షల కోట్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం రూ.8.71 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
రాష్ట్రం ప్రతి ఏడాది 13 నుంచి 15 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తోందని సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ సాధనకు కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో అసోం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!