

వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు పర్యాటకులు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలు తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన సీఎం, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. అలాగే సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసి బాధితులకు అవసరమైన సహాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో తెలుగువారు ఉన్నారనే ప్రాథమిక సమాచారం నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!