

జనాభా నియంత్రణకు బదులుగా జనాభా సంరక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. 'పిల్లలే సంపద' అనే కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని, దేశ అభివృద్ధికి మనుషులే అసలైన సంపద అని పేర్కొన్నారు.
గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయని, అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో కూడా ఫెర్టిలిటీ రేటు పెరగాల్సిన అవసరం ఉందని, మహిళల విద్య, మానవ వనరుల అభివృద్ధి, సమతుల్య జనాభా వృద్ధి భవిష్యత్ అభివృద్ధికి కీలకమని ఆయన అన్నారు. "జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!