
రాజకీయాలు

భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సముద్ర భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు రెండు దేశాలు సంయుక్త రోడ్మ్యాప్ను ప్రకటించాయి. అలాగే ఆస్ట్రేలియా మేరిటైమ్ బోర్డర్ కమాండ్, భారత కోస్ట్గార్డ్ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చేసిన కృషిని ఆయన అభినందించారు. భద్రత, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!