

హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పి.టి. ఉష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ భవనం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలవనుందని తెలిపారు.
ఈ సందర్భంగా పి.టి. ఉష మాట్లాడుతూ, తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. పారదర్శకత, జవాబుదారీతనం, క్రీడాకారుల సంక్షేమం ప్రతి సంస్థ లక్ష్యంగా ఉండాలని సూచించారు. యువ క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!