

శబరిమల ఆలయంలో ద్వారపాలక దేవతా ప్రతిమలకు బంగారు పూత, గర్భగుడి ద్వారాలకు స్వర్ణ తాపడం వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కొత్త సాక్ష్యాలు సేకరించినట్లు కేరళ హైకోర్టుకు తెలిపింది. ట్రావన్కోర్ దేవస్థాన మండలి మాజీ అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్ ప్రమేయం ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. ఈ అంశాన్ని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్కు ఈ వివరాలు జోడించాలని లేదా కొత్త కేసు నమోదు చేయాలని సిట్కు సూచించింది.
సిట్ అధికారి ఎస్. శశిధరన్ సమర్పించిన నివేదిక ప్రకారం, రాగి రేకులకు బంగారు పూతలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పలువురు అధికారులు, సభ్యులు ఇందులో పాల్గొన్నట్లు తేలింది. 2019లో ప్రతిమలను చెన్నైకి తరలించి తక్కువ బంగారం వినియోగించి మిగిలినదాన్ని దుర్వినియోగం చేసినట్లు, 2025లో మళ్లీ పూత పేరుతో తరలించినట్లు వెల్లడైంది. హైకోర్టు అనుమతి లేకుండానే ఈ ప్రక్రియ జరిగిందని పేర్కొంది. ఈ కేసు విచారణను జూలై 20కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!