
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు విడుదల చేశారు. సాధ్యమైన చోట అన్ని కంపెనీలు, కార్యాలయాలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ ఇవ్వాలని సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రహదారులపై ప్రమాదాలను నివారించడం, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడమే ఈ నిర్ణయాల ఉద్దేశమని అధికారులు తెలిపారు. సంస్థలు తమ కార్యాలయాల వివరాలు, ముందస్తు లాగౌట్ సమయాలను ఈ-మెయిల్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్ష సమయంలో అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!