

అస్గర్ అలీ వోహ్రా (81) తన 37 ఏళ్లుగా కొనసాగుతున్న భూవివాదాన్ని పరిష్కరించాలని తన బాల్య మిత్రుడు, ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గుజరాత్లోని వద్నగర్లో మోదీతో కలిసి చదువుకున్న వోహ్రా ఇటీవల ప్రధానిని నేరుగా కలసి తన సమస్యను వివరించారు. మహారాష్ట్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన ప్రధానిని అభ్యర్థించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మీరా రోడ్కు చెందిన వోహ్రా.. 1989లో భాయందర్ ఈస్ట్లోని నవ్ఘర్ ప్రాంతంలో 2,810 చదరపు మీటర్ల భూమిని రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే 2011లో ‘స్వయం బిల్డర్స్’, ‘సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్’ సంస్థలు నకిలీ పత్రాలతో భూమిని ఆక్రమించుకున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై 2015లో ఎఫ్ఐఆర్ నమోదైనా కేసు కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు. పలుమార్లు రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులను ఆశ్రయించినా పరిష్కారం లభించకపోవడంతో ప్రధాని మోదీని కలిశారు. ఆయన అభ్యర్థనపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యాలయ జోక్యంతో సెప్టెంబర్ 16న ప్రత్యేక విచారణకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!