

కేస్లాపూర్లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పార్టీలో చేరారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనందరావుతో పాటు గిన్నెర సర్పంచ్ మేస్రం భీమ్రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్తో పాటు పలువురు సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
ఇక పార్టీ కార్యక్రమాలను విస్తరించే దిశగా కవిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ విజయంతో ఉత్సాహంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పార్టీ కేడర్ను సమీకరించడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ సభ అనంతరం ఇంద్రవెల్లి సభ తేదీని ప్రకటించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!