

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక హాస్య నటనతో గుర్తింపు పొందిన ప్రముఖ నటి పావలా శ్యామల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు ప్రాథమిక ఆరోగ్య బులెటిన్ విడుదల చేశారు.
వైద్యుల వివరాల ప్రకారం, 78 ఏళ్ల పావలా శ్యామలకు రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, పార్కిన్సన్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా మందులు తీసుకోకపోవడంతో నిన్న ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి, ఆహారం తిరిగి రావడం, దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలతో ఆసుపత్రికి వచ్చినట్లు వెల్లడించారు.
వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా తీవ్రమైన జీర్ణాశయ వాపు ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం నిర్వహించిన ఉదర పరీక్షల్లో పిత్తనాళం విస్తరించి ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ద్రవ చికిత్సతో పాటు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. పూర్తి స్థాయి ఆరోగ్య బులెటిన్ను రేపు విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!