

వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు-2027ను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా తెలిపారు.
పుష్కరాల సందర్భంగా రహదారులు, రైల్వే సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. కుంభమేళా తరహాలో టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలను రాష్ట్ర అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా మార్చాలని, ఈ సందర్భంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!