

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనకు సంబంధించిన సమగ్ర ప్రగతి నివేదికలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ పనితీరుపై విడుదల చేసిన శ్వేతపత్రాలకు కొనసాగింపుగా, ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఎలా నడిపించామో వివరించేలా ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్’ విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మొత్తం 10 కీలక అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన వంటి నాలుగు ప్రధాన అంశాలపై నివేదికలను ముఖ్యమంత్రి విడుదల చేయనుండగా, మిగిలిన ఆరు నివేదికలను సంబంధిత మంత్రులు విడుదల చేయనున్నారు. సోమవారం విద్యుత్ రంగంపై తొలి ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల కానుంది. జూలై 18 నాటికి అన్ని నివేదికలను విడుదల చేసి అనంతరం పుస్తక రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తప్పుడు ప్రచారాలకు సమాధానంగా వాస్తవాలను ప్రజల ముందుంచడమే ఈ నివేదికల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!