

వచ్చే వారం పార్లమెంట్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించింది. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ జారీ చేసిన విప్లో ఉదయం 11 గంటల నుంచి సభ ముగిసే వరకు సభ్యులు సభలో ఉండి పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. లోక్సభ కాంగ్రెస్ సభ్యులకు కూడా ఇదే తరహాలో విప్ జారీ చేశారు.
వచ్చే వారం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడించిన తాత్కాలిక ప్రభుత్వ కార్యక్రమాల జాబితాలో FCRA సవరణ బిల్లు, డీలిమిటేషన్కు సంబంధించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావన లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!