
జనరల్

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, మద్దికెర వంటి ప్రాంతాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అన్వేషణలో తొలకరి వర్షాలు పడితే వజ్రాలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్మకం ఉంది.
ఒక్క వజ్రం దొరికినా జీవితం మారిపోతుందని ఆశతో ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమందికి వజ్రాలు దొరికినట్లు సమాచారం. జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ వజ్రాల వేట ఎక్కువగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!