

సూర్య కథానాయకుడిగా, మమిత బైజు కీలక పాత్రలో నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే భారీ బిజినెస్తో వార్తల్లో నిలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్రైలర్, పాటలతో ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుమారు రూ.130 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రానికి థియేట్రికల్ హక్కులు రూ.90 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా మరో రూ.125 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ లెక్కల ప్రకారం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.215 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణ వ్యయంతో పోలిస్తే నిర్మాతలకు విడుదలకు ముందే దాదాపు రూ.85 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు అంచనా. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్కు ఈ చిత్రం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా మారింది. సంస్థ నుంచి ఇటీవల వచ్చిన ‘లెనిన్’ మంచి వసూళ్లు సాధించడంతో, ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!