
ఆరోగ్యం

మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు ఏపీ భవన్ అధికారులు థాయ్లాండ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులతో మాట్లాడారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న అధికారులు.. స్థానిక కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. విద్యార్థులకు అవసరమైన సహాయంపై వివరాలను సేకరించారు.
విద్యార్థుల పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని థాయ్లాండ్లోని భారత రాయబారికి ఏపీ భవన్ అధికారులు పంపించారు. స్థానిక ఇమ్మిగ్రేషన్ అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని, విద్యార్థులకు తగిన సహాయం అందించాలని కోరారు. విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!