
జనరల్

స్పైస్జెట్కు చెందిన పలు విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, కొన్ని రద్దు కావడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ 1లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు తీవ్ర గందరగోళం నెలకొంది. గంటల తరబడి వేచి చూసిన వందలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నిరీక్షణకు విసిగిపోయిన పలువురు ప్రయాణికులు సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ముంబై నుంచి బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యమవగా, గోరఖ్పూర్ వెళ్లాల్సిన ఒక విమానం రద్దయింది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని సంస్థ తెలిపింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!