

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC-USA), టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్, పలు తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రవాస తెలుగువారు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆయన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఈ పర్యటనలో భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, హరిత ఇంధనం, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలపై ప్రవాస భారతీయులతో చర్చించనున్నారు. అలాగే ప్రవాస తెలుగువారితో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన సమావేశాల్లో పాల్గొననున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!