
సినిమాలు

సంగీత దర్శకుడిగా విశేష గుర్తింపు పొందిన రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్, ‘ఎల్లమ్మ’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో సురభి కథానాయికగా నటిస్తుండగా, ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు పెంచింది. తాజా సమాచారం ప్రకారం, నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా, సంగీతాన్ని కూడా దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా అందిస్తుండటంతో సినిమా పాటలపై కూడా భారీ ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!