
ఓటీటీ

ములుగు జిల్లా మరియు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండల మధ్య నుంచి ప్రవహిస్తున్న వరద నీరు భారీగా కిందికి దూకుతూ ఆకట్టుకుంటున్నప్పటికీ ప్రమాదకరంగా మారింది. జలపాతం వద్ద ఈతకొలను నిండి పగోడా సమీపం నుంచి నీరు పొంగిపొర్లుతోంది.
వరద ఉద్ధృతి పెరగడంతో చీకుపల్లి వాగు ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిషేధించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు అక్కడికి వెళ్లవద్దని అధికారాలు సూచించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!