

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అత్యాచారం కేసులను పరిష్కరించేందుకు మధ్యవర్తుల ద్వారా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఒక సిండికేట్ను నడుపుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఒక్కో కేసుకు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఎం భగవంత్ మాన్ కూడా వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ నేత ప్రదీప్ బండారీ ఆరోపించారు.
గతంలో పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ కూడా గుర్ప్రీత్ కౌర్పై ఇదే తరహా ఆరోపణలు చేసినట్లు బీజేపీ పేర్కొంది. ఓ అత్యాచారం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!