

నేపాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో బాధితులను చేరుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్న నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆమె నేతృత్వంలో ఆరు రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించారు. మొదటి రెండు రోజుల్లోనే 200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆమె తెలిపారు.
వరద ప్రభావిత రుసువా జిల్లాలోని తైమూర్ పట్టణంలో దాదాపు 20 హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బురదతో నిండిన ప్రాంతాల్లో హెలికాప్టర్లను దించడం, బాధితులను ఎక్కించడం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రియా అధికారి తెలిపారు. రేడియో ద్వారా పైలట్ల మధ్య సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ శాస్త్రం చదివిన ఆమె తొలుత క్యాబిన్ క్రూగా పనిచేశారు. హెలికాప్టర్ ప్రయాణంతో స్ఫూర్తి పొంది పైలట్ కావాలనే ఆసక్తితో ఫిలిప్పీన్స్లో శిక్షణ పొందారు. 2017లో హెలికాప్టర్ పైలట్గా కెరీర్ ప్రారంభించి, అనంతరం హిమాలయాల్లో అధిక ఎత్తు రెస్క్యూ ఆపరేషన్లలో నైపుణ్యం సాధించారు. ఎవరెస్ట్ ప్రాంతంలో గాయపడిన పర్వతారోహకులను రక్షించడంతో పాటు సుమారు 6,200 మీటర్ల ఎత్తు వరకు రెస్క్యూ మిషన్లు నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!