
జనరల్

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దహిఫలే కుటుంబంలో దాదాపు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. ఐదో తరంలో కుమార్తె పుట్టడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గార్గి అనే పేరుతో నామకరణం చేసిన చిన్నారిని ఆస్పత్రి నుంచి ఇంటికి రథంలో ఘనంగా తీసుకువచ్చారు. డప్పులు, వాయిద్యాల మధ్య బంధువులు, కుటుంబ సభ్యులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
చిన్నారి జన్మించిన విషయం తెలియగానే ఆమెను ఘనంగా స్వాగతించాలని కుటుంబం నిర్ణయించుకున్నట్లు అమ్మమ్మ సురేఖ దహిఫలే తెలిపారు. గార్గి తాత లింబాజీ దహిఫలే మాట్లాడుతూ, కుటుంబంలో ఆడపిల్ల లేకపోవడం వల్ల ఉన్న లోటు ఇప్పుడు తీరిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆడపిల్ల జననాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ద్వారా దహిఫలే కుటుంబం సమాజానికి సానుకూల సందేశం ఇచ్చిందని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!