3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

Writer: Pooja 03:06 PM, 3 సెప్టెంబర్, 2026
మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

భారత్‌లో తయారైన బీఎస్ఏ బ్యాంటమ్ బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. బైక్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన బోరిస్ జాన్సన్, సాంకేతిక రంగంలో భారత్-బ్రిటన్ సహకారానికి ఇది మంచి ఉదాహరణ అని అన్నారు. బీఎస్ఏ బైక్‌లను ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ భారత్‌లో తయారు చేసి, యూకేతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. బోరిస్ జాన్సన్ భారతీయ తయారీ బైక్‌ను ఆస్వాదించడం సంతోషంగా ఉందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అదే సమయంలో బీఎస్ఏ పేరును ‘బోరిస్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ’గా మార్చమని మాత్రం అడగవద్దంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

బ్రిటన్‌కు చెందిన బర్మింగ్‌హమ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) సంస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1861లో చిన్న ఆయుధాల తయారీతో ప్రారంభమైన ఈ సంస్థ అనంతరం మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిలోకి ప్రవేశించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బీఎస్ఏ బైక్‌లు కీలక పాత్ర పోషించగా, 1950లను సంస్థ స్వర్ణయుగంగా పేర్కొంటారు. అయితే పాతబడిన సాంకేతికత, కార్మికుల ఆందోళనలు తదితర కారణాలతో 1970ల నాటికి ఉత్పత్తి నిలిచిపోయింది. 2016లో మహీంద్రా గ్రూప్ బీఎస్ఏలో 100 శాతం వాటాను కొనుగోలు చేసి, బ్యాంటమ్ మోడల్‌ను పునరుద్ధరించింది. ప్రస్తుతం బీఎస్ఏ గోల్డ్‌స్టార్, స్క్రాంబ్లర్‌తో పాటు బ్యాంటమ్ బైక్‌లు భారత్‌లో తయారవుతూ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

ట్యాగ్లు
బోరిస్ జాన్సన్బీఎస్ఏ బ్యాంటమ్ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్మేడ్ ఇన్ ఇండియాభారత్ బ్రిటన్ భాగస్వామ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు
జనరల్

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం
జనరల్

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని
జనరల్

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన
జనరల్

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు
జనరల్

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్
రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

స్టాలిన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు
రాజకీయాలు

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి
రాజకీయాలు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!