
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నాహకాలు, ప్రీ-ఎలక్షన్ కార్యకలాపాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై గ్రామపంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను సమర్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన కీలక కార్యక్రమాలపై ఎస్ఈసీ సమీక్ష చేపట్టింది. ఓటరు జాబితాల సవరణ, రిజర్వేషన్ల ఖరారు, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!