
టెక్నాలజీ

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సోమవారం చైనాలో పర్యటిస్తున్నారు. ఆగస్టు 25న చైనా విదేశాంగ మంత్రి, భారత-చైనా ప్రత్యేక ప్రతినిధి చర్చల్లో తన ప్రతినిధి వాంగ్ యీతో కలిసి 25వ దఫా చర్చల్లో పాల్గొననున్నారు. 2003లో ఏర్పాటైన ఈ ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థ ద్వారా 3,488 కిలోమీటర్ల భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి.
ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం, సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడం ఈ చర్చల్లో కీలక అంశాలుగా ఉండనున్నాయి. గత ఏడాది జరిగిన 24వ దఫా చర్చల్లో సరిహద్దు సమస్యకు న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం రాజకీయ దృక్పథంతో ముందుకెళ్లాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో అజిత్ డోభాల్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!