

బూకబ్జాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఏర్పాటైందని, వ్యాపార ప్రయోజనాల కోసం కాదని అన్నారు. సెప్టెంబర్ 2న నిర్వహించనున్న వేలాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హానర్ హోమ్స్కు కేటాయించిన సుమారు రూ.20 వేల కోట్ల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల ప్రశ్నించారు. 22ఏ నిబంధన ద్వారా రూ.10 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో 30 శాతం వాటా ఉన్నట్లు ఆరోపించారు. పేదలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!