
రాజకీయాలు

ప్రపంచంలో అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న సహారా ఎడారి ప్రాంతమైన అల్జీరియా–మాలి సరిహద్దుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీటి చుక్క కూడా దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మాలీ నుంచి నైజర్లో ఉన్న కుటుంబ సభ్యులతో బక్రీద్ వేడుకలు జరుపుకునేందుకు ట్రక్కులో బయల్దేరిన వారు ఈ ప్రమాదానికి గురయ్యారు.
మధ్యలో ట్రక్కు చెడిపోవడంతో ప్రయాణికులు రోజుల తరబడి ఎడారిలో చిక్కుకుపోయారు. ఇద్దరు వ్యక్తులు కాలినడకన సాహసోపేతంగా ప్రయాణించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సహాయం అందకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!