

ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులు పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేశాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తుండగా, భారత్ చమురు దిగుమతులపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడం భారత్కు ఆందోళనకరం. దేశం తన ముడి చమురు అవసరాల్లో సగానికి పైగా ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటోంది.
చమురు ధరలు ఇప్పటికే పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. ఒకవేళ హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే బ్యారెల్ ధరలు 95-110 డాలర్ల వరకు చేరే ప్రమాదముందని అంచనాలు ఉన్నాయి. దీనివల్ల భారత్ దిగుమతి బిల్లు పెరిగి కరెంట్ ఖాతా లోటు అధికమవుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల సరకు రవాణా ఖర్చులను పెంచి సాధారణ వినియోగదారుడిపై భారం మోపుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లు, బంగారం-వెండి ధరలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు త్వరగా చల్లారకపోతే భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!