
జనరల్

ప్రముఖ స్థిరాస్తి సంస్థ వాధ్వా గ్రూప్ ముంబయి వాషిలోని విష్వరూప్ ఐటీ పార్క్లో సుమారు 33,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్స్టార్కు లీజుకు ఇచ్చింది. ఈ ఒప్పందం 9 సంవత్సరాల కాలవ్యవధికి కుదిరింది. దీని ద్వారా 2034 నాటికి వాధ్వా గ్రూప్కు సుమారు రూ.43.54 కోట్ల అద్దె ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
ఈ లావాదేవీ వాణిజ్య ఆఫీస్ స్పేస్ విభాగంలో వాధ్వా గ్రూప్కు కీలకమైన ముందడుగుగా నిలిచింది. అంతేకాకుండా కంపెనీ త్వరలోనే ఐపీఓకు రావడానికి కూడా సిద్ధమవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!