
జనరల్

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్నగర్, కూకట్పల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిల్వ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, మరో రెండు గంటల పాటు మోస్తరు వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!