

దేశంలోని పలు ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లో ఏటీఎంలలో నగదు కొరతపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గత మూడు నెలలుగా ఈ సమస్య తీవ్రంగా మారిందని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు నగదు ఉపసంహరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పందించింది. ఏటీఎంలలో నగదు నింపే బ్యాంకు శాఖల్లో నగదు నిల్వల వివరాలపై నివేదిక సమర్పించాలని బ్యాంకులను కోరినట్లు సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు నిల్వలు వాటి సగటు సామర్థ్యంలో కేవలం 57 నుంచి 64 శాతం మాత్రమే ఉన్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది.
అయితే బ్యాంకులు కూడా తమ సమస్యలను వెల్లడిస్తున్నాయి. శాఖల్లో ఉన్న నగదు అంతా ఏటీఎంలలో నింపేందుకు అనుకూలంగా ఉండదని, చినిగిన లేదా చలామణికి పనికిరాని నోట్లు కూడా నిల్వల్లో ఉంటాయని పేర్కొంటున్నాయి. అలాగే నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల కొత్త ఏటీఎంల ఏర్పాటు, నగదు నిర్వహణ కూడా సవాల్గా మారిందని బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!