
ఓటీటీ

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజా ధరలను ప్రకటిస్తూ పెట్రోలుపై లీటరుకు రెండు రూపాయల ఎనభై నాలుగు పైసలు, డీజిల్పై రెండు రూపాయల ఎనభై ఆరు పైసలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెంచిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి.
ఇటీవల కాలంలో ఇంధన ధరలు వరుసగా పెరగడం ఇది నాలుగోసారి కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు రవాణా ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!