
సినిమాలు

2025–26 ఆర్థిక సంవత్సరంలో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) సుమారు 700 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించగా, డాబర్ ఇండియా కూడా 573 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. అలాగే హెచ్యూఎల్ మధ్యస్థ ఉద్యోగుల సగటు వేతనాలను 6.08 శాతం మాత్రమే పెంచింది.
అయితే మేనేజర్లు మినహా ఇతర ఉద్యోగుల సగటు వేతనాలను హెచ్యూఎల్ 6.85 శాతం పెంచింది. డాబర్ ఇండియా మధ్యస్థ ఉద్యోగుల జీతాలను సగటున 7.7 శాతం పెంచింది. మరోవైపు నెస్లే ఇండియా, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వేతన పెంపులు కూడా ప్రకటించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!