

దేవి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సహాయం పొందిన 10 మంది విద్యార్థులు సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో విజయవంతంగా పట్టాలు అందుకోవడంతో నటుడు విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బన్రుటికి చెందిన రైతు కుటుంబానికి చెందిన ఎం. దీపిక బీసీఏలో గోల్డ్ మెడల్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ విద్యార్థుల విజయం తన కుటుంబానికి, బృందానికి ఎంతో గర్వకారణమని విశాల్ పేర్కొన్నారు.
2017లో అన్బు ఫౌండేషన్ స్కాలర్షిప్ కింద నాలుగు సీట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు అనేక మంది విద్యార్థుల జీవితాలను మార్చిన గొప్ప విద్యా వేదికగా ఎదిగిందని విశాల్ తెలిపారు. ఈ ఏడాది పట్టభద్రులైన 10 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ లేదా ఫస్ట్ క్లాస్ విత్ ఎగ్జాంప్లరీ ఫలితాలతో ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. విద్యార్థులకు అండగా నిలిచిన సత్యభామ సంస్థకు చెందిన మారియాకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!