

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గుల ప్రభావంతో వరుసగా మూడు రోజుల పాటు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,500గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,63,090గా కొనసాగుతోంది. వెండి ధర కూడా మార్పు లేకుండా కిలోకు రూ.2,70,000 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, లక్నోలో 22 క్యారెట్ల బంగారం రూ.1,50,500, 24 క్యారెట్ల బంగారం రూ.1,64,500గా ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నైలో హైదరాబాద్, విజయవాడ, విశాఖ తరహాలోనే ధరలు నమోదయ్యాయి. స్థానిక పన్నులు, 3 శాతం జీఎస్టీ, తయారీ ఛార్జీల కారణంగా తుది రిటైల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!