
సినిమాలు

కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈఓ బి. రమేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల మధ్య ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను వెంటనే పెంచకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రజల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరిగితే వినియోగ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
రాబోయే ఏడాదిలో పసిడి రుణాలకు మంచి గిరాకీ ఉంటుందని ఆయన తెలిపారు. సురక్షిత రుణాల వైపు బ్యాంకులు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ చరిత్రలోనే గరిష్ఠంగా రూ.2,510 కోట్ల లాభం నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే నికర ఎన్పీఏలను 0.19 శాతానికి తగ్గించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20కి పైగా కొత్త శాఖలను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!