

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.3,300 తగ్గి రూ.1.62 లక్షలకు చేరింది. వరుసగా మూడో సెషన్లోనూ ధరలు తగ్గడం గమనార్హం. మూడు సెషన్లలో బంగారం ధర రూ.4,700 లేదా దాదాపు 3 శాతం తగ్గింది.
వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,45,500కు చేరింది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, డాలర్లో మార్పులు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ధరలపై ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బంగారం అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు కూడా ధరలపై ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,599.70 డాలర్లు, వెండి 70.31 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా తరచూ మారుతుంటాయి. కొనుగోలు లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తాజా ధరలను పరిశీలించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!