
గాసిప్స్

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ FY27ను బలమైన వృద్ధితో ప్రారంభించింది. తొలి త్రైమాసికంలో స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం గతేడాదితో పోలిస్తే 10.9 శాతం పెరిగి రూ.3,506 కోట్లకు చేరింది. రిటైల్, వాణిజ్య బీమా విభాగాల్లో నమోదైన వృద్ధి సంస్థకు కలిసొచ్చింది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ 49.9 శాతం, పర్సనల్ యాక్సిడెంట్ బీమా 26.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
వాణిజ్య విభాగాల్లో ఇంజినీరింగ్ బీమా 95.4 శాతం, మెరైన్-కార్గో బీమా 16.8 శాతం వృద్ధిని సాధించాయి. క్యూ1లో సంస్థ సమగ్ర ఆదాయం రూ.573 కోట్లు కాగా, పన్ను అనంతర లాభం రూ.426 కోట్లుగా నమోదైంది. సాల్వెన్సీ రేషియో 2.0 రెట్లుగా, కంబైన్డ్ ఆపరేటింగ్ రేషియో 96.18 శాతంగా ఉంది. కొత్త ఇండ్ ఏఎస్ విధానం కింద ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తొలి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థగా ఎస్బీఐ జనరల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!