ప్రోగ్శక్తి కార్యక్రమం ద్వారా మహిళా వ్యవస్థాపకులకు రూ.10,000 కోట్లకు పైగా రుణాలను అందించినట్లు ఎంఎస్ఎంఈ ఫిన్టెక్ సంస్థ ప్రోగ్క్యాప్ సహ వ్యవస్థాపకురాలు పల్లవి శ్రీవాస్తవ తెలిపారు. ఈ పథకం కింద ఒక్కొక్క మహిళా వ్యవస్థాపకురాలికి రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు అందిస్తున్నామని ఆమె వెల్లడించారు.
ప్రోగ్క్యాప్ మొత్తం రుణ పోర్ట్ఫోలియోలో మహిళా రుణ గ్రహీతల వాటా ప్రస్తుతం 17 శాతంగా ఉందని, ఈ సంఖ్య ప్రతి సంవత్సరం సుమారు 40 శాతం చొప్పున పెరుగుతోందని పల్లవి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మహిళా వ్యవస్థాపకుల్లో దాదాపు 90 శాతం మంది రెండో మరియు మూడో అంచె నగరాలకు చెందినవారని ఆమె వివరించారు.
మహిళా వ్యవస్థాపకులు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లలో ఒకటి రుణాలు పొందడమే అని పల్లవి తెలిపారు. సాధారణంగా తనఖా లేదా పురుష సహ దరఖాస్తుదారు ఉంటేనే వారికి రుణాలు మంజూరవుతున్నాయని చెప్పారు. అయితే ప్రోగ్శక్తి కార్యక్రమం ద్వారా ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!