

కాంతార చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని జై హనుమాన్, అనంతరం ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో నిర్మాత నాగవంశీ నిర్మాణంలో, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందాల్సిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో కూడా ఆయన నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి రిషబ్ శెట్టి, నిర్మాత నాగవంశీ మధ్య రెమ్యూనరేషన్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ, దీనిపై రిషబ్ శెట్టి, నాగవంశీ లేదా చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దైందా లేదా తాత్కాలికంగా వాయిదా పడిందా అనే విషయంపై అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!