

ప్రముఖ వెల్త్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ 360 వన్ విడుదల చేసిన ‘వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026’ ప్రకారం దేశంలో కనీసం రూ.425 కోట్ల వ్యక్తిగత సంపద కలిగిన 3,040 మంది ఉన్నారు. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.104 లక్షల కోట్లు కాగా, ఇది భారత నామినల్ జీడీపీలో సుమారు 30 శాతానికి సమానమని సంస్థ వెల్లడించింది.
ఈ జాబితాలో తొలి మూడు స్థానాలను అనంత్ అంబానీ, ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ దక్కించుకున్నారు. ఒక్కొక్కరి వ్యక్తిగత సంపద రూ.2.75 లక్షల కోట్లకు పైగా ఉంది. మొత్తం సంపదలో 19 శాతం టాప్-10 ధనికుల వద్దే కేంద్రీకృతమై ఉంది. సంపద సృష్టికర్తల కేంద్రంగా ముంబై నిలిచింది. అక్కడి నుంచి 802 మంది జాబితాలో చోటు దక్కించుకోగా, మొత్తం సంపదలో వారి వాటా 38.4 శాతంగా ఉంది.
జాబితాలో 1,696 మంది తొలి తరం పారిశ్రామికవేత్తలు, 1,290 మంది వారసత్వంగా సంపద పొందినవారు ఉన్నారు. అలాగే 738 మంది మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వారి వాటా మొత్తం సంపదలో 22.6 శాతం. దేశంలోని 183 మంది బిలియనీర్లలో 47 మంది మహిళలు ఉన్నారు. టాప్ 100 వ్యాపార కుటుంబాల జాబితాలో రూ.9.08 లక్షల కోట్ల సంపదతో అదానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!