

దేశ రాజధాని ప్రాంతంలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరల పెరుగుదల నేపథ్యంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కిలోకు రూ.2 పెంచారు. తాజా సవరణతో ఢిల్లీలో ఒక్క కిలో సీఎన్జీ ధర రూ.83.09కి చేరుకుంది. కొత్త ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
గత 11 రోజుల్లో ఇది మూడోసారి ధర పెంపు కావడం గమనార్హం. ఈ నెల 15న రూ.2, మే 23న రూ.1, ఈరోజు మరో రూ.2 పెరిగింది. మొత్తంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే కిలోకు రూ.5 పెరిగింది. గల్ఫ్ ప్రాంత ఉద్రిక్తతలతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
సీఎన్జీపై ఆధారపడే ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం సామాన్య ప్రయాణీకులపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇతర నగరాల్లో కూడా త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!