

దేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ తన మెగా ఐపీఓకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్ను ప్రకటించింది. ఒక్కో షేరు ధరను రూ.545 నుంచి రూ.574గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,692.91 కోట్లు సమీకరించనున్నట్లు అంచనా. దీంతో 2026లో దేశీయ ప్రాథమిక మార్కెట్లో అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా ఇది నిలవనుంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.1.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో జరుగుతోంది. ఇందులో ప్రమోటర్లు 20 కోట్లకు పైగా షేర్లను విక్రయించనుండగా, కంపెనీకి కొత్తగా నిధులు సమకూరవు. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస లాట్ పరిమాణం 26 షేర్లుగా నిర్ణయించగా, కనీస పెట్టుబడి రూ.14,924 అవసరం. జూలై 13న యాంకర్ ఇన్వెస్టర్ల బుక్ ప్రారంభం కానుండగా, జూలై 14 నుంచి 16 వరకు సబ్స్క్రిప్షన్ కొనసాగుతుంది. షేర్ల కేటాయింపు జూలై 17న జరిగే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!